రెండో పెళ్లి కోసం నిండు గర్భిణీని గొంతు నులిమి చంపిన భర్త

రెండో పెళ్లి కోసం నిండు గర్భిణీని గొంతు నులిమి చంపిన భర్త

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గన్నారంలో దారుణం జరిగింది. నిండు గర్భిణీని గొంతు నులిమి చంపాడు భర్త. ఈ నెల 22వ తేదీ రాత్రి నిద్రిస్తున్న భార్య సుమలతను చంపాడు భర్త నాగేష్. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యను చంపి రెండో పెళ్లి చేసుకోవాలని నాగేష్ ఈ దారుణానికి పాల్పడ్డాడు. 

చనిపోయాక సహజ మరణంగా చిత్రీకరించే యత్నం చేశాడు. అల్లుడు ప్రవర్తనపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది సుమలత తల్లి. ఈ మేరకు పోలీసులు నాగేష్‎ను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించారు. పోలీసుల విచారణలో తానే చంపినట్లు ఒప్పుకున్నాడు నాగేష్. ఈ మేరకు నాగేష్‎పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.