ఆగస్టు 19 నుంచి మైనార్టీలకు రూ.లక్ష సాయం: మైనార్టీ శాఖ సెక్రటరీ ఉమర్‌

ఆగస్టు 19 నుంచి మైనార్టీలకు రూ.లక్ష సాయం: మైనార్టీ శాఖ సెక్రటరీ ఉమర్‌

హైదరాబాద్, వెలుగు: మైనార్టీల కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించనున్నారు. శనివారం ఉదయం 11.30 గంటల నుంచి హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లోనూ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినున్నామని మైనార్టీశాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మైనార్టీస్​ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. ఈ పథకాన్ని గత నెల 24న ప్రభుత్వం ప్రకటించింది. వంద శాతం సబ్సిడీతో ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.లక్ష సాయాన్ని రాష్ట్ర సర్కార్‌‌ అందించనుంది. నిరుడు ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న ముస్లింలు కొత్తగా అప్లయ్ చేసుకోవాల్సిన అవసరం లేదని, వారిని ఈ పథకంలో కన్సిడర్ చేస్తామని ప్రకటించింది. క్రిస్టియన్లు మాత్రం కొత్తగా అప్లయ్‌ చేసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.