ముంబై: సుమారు 2.5 లక్షల రెండు వేల కరెన్సీ నోట్లు వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. చలామణీలోని మొత్తం 3.6 లక్షల రూ. 2 వేల కరెన్సీ నోట్లలో ఇది రెండొంతులకు సమానం. రూ. 2 వేల నోట్ల మార్పిడి లేదా డిపాజిట్కు ప్రజలకు సెప్టెంబర్ చివరిదాకా గడువు ఇచ్చిన రిజర్వ్ బ్యాంకుకు ఇది ఊరట కలిగిస్తోంది. రూ. 2 వేల నోట్ల ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ చేసుకోవడంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులూ ఎదుర్కోవడం లేదని ఆర్బీఐ అధికారులు చెబుతున్నారు.
గడువు ఇంకా ఉన్నప్పటికీ, వీలైనంత తొందరగా రూ. 2 వేల నోట్లను మార్చుకోవల్సిందిగా వారు ప్రజలకు సూచిస్తున్నారు. రూ. 2 వేల నోట్లను చలామణీ నుంచి విత్డ్రా చేస్తున్నట్లు మే నెలలో ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.