జర్మనీకి చెందిన ఆడి కంపెనీ తన కొత్త స్పోర్ట్స్ కారు ‘ఆర్ఎస్ 7’ను ఇండియా మార్కెట్లో గురువారం లాంచ్ చేసింది. దీని ఢిల్లీ ఎక్స్ షోరం ధర 1.94 కోట్లని కంపెనీ ప్రకటించింది. ఈ నెల జూన్ 23 నుంచి ప్రీబుకింగ్ చేసుకోవచ్చు. వచ్చే నెలలో అమ్మకాలు మొదలవుతాయి. ఆర్ఎస్7 కారులో 4.0 లీటర్ ట్విన్-టర్బో వి 8 పెట్రోల్ ఇంజన్ 800 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.

