భారత రక్షణ శాఖకి అదనపు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. రూ. 7 వేల 800 కోట్ల విలువైన ఈ కొనుగోళ్లలో ఎంఐ – 17 వీ5 హెలికాప్టర్లకు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ కూడా ఉండనుంది.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్నేతృత్వంలోని రక్షణ కొనుగోళ్ల మండలి అనుమతించిన కొనుగోళ్లలో 7.6251 ఎంఎం లైట్మెషిన్గన్, నౌకాదళంలోని ఎంహెచ్– 60 ఆర్హెలికాప్టర్లకు ఆయుధాల కొనుగోలు వంటివి ఉన్నాయి.
వీటిలో ఈడబ్ల్యూ వ్యవస్థను భారత్ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) నుంచి సేకరించనున్నారు. రక్షణశాఖ బలోపేతానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు.