స్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు.. ఆరు బస్సులు సీజ్

స్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు.. ఆరు బస్సులు సీజ్

రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ తిరిగి ప్రారంభం కావడంతో ప్రైవేటు బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్కూల్ బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ నిర్వహించారు.  నిబంధనలు ఉల్లంఘించిన బస్సులను అధికారులు సీజ్ చేశారు. 

పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో విద్యార్థులను తరలించే బస్సులపై రవాణా శాఖా అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే స్కూల్ బస్సుల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. వనస్థలిపురంలో స్కూల్ బస్సులను తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 2 బస్సులను సీజ్ చేశారు. అటు   రాజేంద్రనగర్ లో మూడు బస్సులు సీజ్ చేశారు. 

ఫిట్ నెస్, ఇన్స్యూరెన్స్, పర్మిట్, పొల్యూషన్, డ్రైవింగ్ లైనెన్స్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వంటి వాటిని  కూడా క్షుణంగా పరీక్షిస్తున్నారు అధికారులు. ఈ తనిఖీల్లో వివిధ పాఠశాలకు చెందిన మొత్తం ఆరు బస్సులను అధికారులు సీజ్ చేయడం గమనార్హం. ఈ తనిఖీలు వారం రోజుల పాటు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.