డివైడర్ పైకి ఎక్కిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

డివైడర్ పైకి ఎక్కిన ఆర్టీసీ బస్సు.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు

సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ములుగు రాజీవ్ రహదారిపై డీసీఎం వాహనాన్ని ఆర్టీసీ బస్సు వెనక నుంచి అతివేగంగా ఢీకొంది. అంతటితో ఆగకుండా బస్సు డివైడర్ పైకి ఎక్కింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. 

ALSO READ:సమ్మర్ స్పెషల్ రైళ్లు ఆగస్టు వరకు పొడిగింపు