ఆర్టీసీ విలీనం ఆస్తుల కోసమే: రఘువీర్ రెడ్డి

ఆర్టీసీ విలీనం ఆస్తుల కోసమే: రఘువీర్ రెడ్డి
  • పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్రెడ్డి


వికారాబాద్, వెలుగు: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ఎన్నికల కోసమేనని, తొమ్మిదేండ్లుగా గుర్తురాని ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు గుర్తుకొచ్చారా అంటూ పీసీసీ రాష్ట్రప్రధాన కార్యదర్శి పట్లోళ్ల రఘువీర్ రెడ్డి విమర్శించారు. వికారాబాద్ జిల్లాకేంద్రంలో ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఆర్టీసీకి ఉన్న వేలాది కోట్ల రూపాయల ఆస్తులను అమ్ముకోవడానికే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు కొత్త డ్రామాకు తెరతీసిందని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు బాకీ ఉన్న 2013 ఎరియర్స్‌‌‌‌తో పాటు రెండు పీఆర్సీలను కలిపి ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.