యునైటెడ్ నేషన్స్ : యూఎన్ భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధిగా దౌత్యవేత్త రుచిరా కాంబోజ్(58) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మండలిలో ఈ బాధ్యతలు చేపట్టిన ఇండియా మొదటి మహిళా దౌత్యవేత్తగా ఆమె రికార్డు సృష్టించారు. 1987 ఇండియన్ ఫారెన్సర్వీస్ బ్యాచ్కు చెందిన కాంబోజ్ ఇంతకుముందు భూటాన్కు ఇండియా దౌత్యవేత్తగా పనిచేశారు. ఈ ఏడాది జూన్లో మండలిలో భారత శాశ్వత ప్రతినిధిగా ఆమె నియమితులైనారు. ఇంతకుముందు ఈ స్థానంలో ఉన్న టీఎస్తిరుమూర్తి పదవీకాలం ముగిసిపోవడంతో ఆయన స్థానంలో కాంబోజ్చార్జ్ తీసుకున్నారు. రెండేళ్లపాటు ఆమె ఈ పదవిలో ఉంటారు. భద్రతా మండలిలో ఇండియా తరపున బాధ్యతలు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆమె ట్వీట్ చేశారు.
ఆమెకు తిరుమూర్తి ట్విటర్లో అభినందనలు తెలియజేశారు. అలాగే యూఎన్ మాజీ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, యూఎన్ విమెన్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీ పూరి కూడా ఆమెకు అభినందనలు తెలిపారు. మండలిలో కాంబోజ్ నియామకం ఒక మైలురాయి అని పూరి ట్వీట్ చేశారు. కాగా పారిస్లో కాంబోజ్ తన డిప్లొమాటిక్ కెరీర్ను ప్రారంభించారు.1981 నుంచి 1991 దాకా పారిస్లో భారత దౌత్యవేత్తగా పనిచేశారు. తర్వాత ఢిల్లీకి తిరిగివచ్చి 1991–96 మధ్య విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖలో అండర్ సెక్రటరీగా సేవలందించారు. అనంతరం మారిషస్లో ఎకనామిక్ అండ్ కమర్షియల్ విభాగంలో ఫస్ట్ సెక్రటరీగా పనిచేశారు. 2002 నుంచి 2005 మధ్య యూఎన్లో ఇండియా పర్మనెంట్ మిషన్లో ఆమె కౌన్సెలర్గా సేవలందించారు. తాజాగా మండలిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్తో రుచిర భేటీ అయ్యారు.