పాలకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు : హరగోపాల్

పాలకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దు :   హరగోపాల్

ముషీరాబాద్,వెలుగు: సమాజంలో జరిగే ప్రజా విధ్వంసాలను అరికట్టేందుకు పాలకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్ హరగోపాల్ పేర్కొన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాతృక ప్రచురణలు, పాలమూరు అధ్యయన వేదిక సంయుక్తాధ్వర్యంలో ఆంగ్ల రచయిత్రి మౌమిత అలం రాసిన కవిత్వాలు ‘ రాయకూడని పద్యం’ పుస్తకావిష్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ పాలకులు ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజల ఆకాంక్షల నెరవేర్చాలే తప్ప వారిలో వైషమ్యాలు పెంచొద్దని సూచించారు.  ఈ సభలో  పీఓడబ్ల్యు జాతీయ కన్వీనర్ సంధ్య, రాఘవాచారి, రమా సుందరి, విమల, ఉదయ మిత్ర, శ్రీరామ్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.