పాఠశాలలో చిరుత సంచరిస్తోందనే వదంతులు

పాఠశాలలో చిరుత సంచరిస్తోందనే వదంతులు

కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రగతినగర్ లో అర్థరాత్రి చిరుత సంచరిస్తోందనే వదంతులు వ్యాపించాయి. ప్రగతినగర్ గీతాంజలి పాఠశాలలోని మొదటి అంతస్థులోని గదిలో నుంచి చిరుతపులి అరుపులు వినిపించాయంటూ స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారమందుకున్న పోలీసు, అటవీ శాఖ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని చిరుత కోసం గాలించారు. ఐతే స్కూల్ లోకి చిరుత చొరబడలేదని పోలీసులు నిర్ధారించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే చిరుత సంచరిస్తోందని పుకార్లు లేపినట్లు పోలీసులు చెపుతున్నారు.  మరోవైపు స్కూల్ కి సెలవు ప్రకటించింది యాజమాన్యం. స్కూల్ వాచ్ మెన్ నరసయ్య…. డ్రైవర్ లోవ రాజును బాచుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిరుత వార్తపై విచారిస్తున్నారు.