భక్తులతో బాసర కిటకిట

భక్తులతో బాసర కిటకిట

బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. చదువుల తల్లిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించుకున్నారు. తమ పిల్లలకు బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించమని అమ్మవారిని వేడుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది.