స్కూల్స్ ఓపెన్ అయినా.. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

స్కూల్స్ ఓపెన్ అయినా.. తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్కూల్స్ ప్రారంభమైనప్పటికి శ్రీవారి సన్నిదిలో ఏ మాత్రం భక్తుల రద్దీ తగ్గలేదు. స్వామి వారిని దర్శించుకునే భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయాయి. మరోవైపు దాదాపు మూడు కిలో మీటర్ల మేర బయట బారులు తీరారు భక్తులు. దీంతో శ్రీవారి దర్శనానికి దాదాపు 26 గంటల సమయం పడుతోంది. మరోవైపు నడకదారి, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు ఏడు గంటల టైం పడుతోంది. అటు అలిపిరి టోల్ గేట్ దగ్గర వాహనాలు బారులు తీరాయి. వాహనాల తనిఖీలు ఆలస్యం కావటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.