బాలీవుడ్ నటుడు ఆయుష్ శర్మ హీరోగా నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘రుస్లాన్’. కరణ్ బి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. సుశ్రీ మిశ్రా హీరోయిన్. కె.కె. రాధామోహన్ నిర్మించారు. ఏప్రిల్ 26న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్కు రచయిత విజయేంద్ర ప్రసాద్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ కథ చాలా బాగుంది. టీజర్ చాలా సార్లు చూశా. చూసిన ప్రతిసారి కొత్త కోణం కనిపిస్తోంది. కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.
మంచి సినిమాటిక్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుందని ఆయుష్ శర్మ చెప్పాడు. ఇది తన రెండో హిందీ చిత్రమని, చాలా స్పెషల్గా ఉంటుందని అన్నారు జగపతిబాబు. నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ ‘హిందీలో ఇది మా మొదటి సినిమా. అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు చూసింది కేవలం గ్లింప్స్ మాత్రమే. యాక్షన్తో పాటు ఎమోషన్, మంచి డైలాగ్స్, అందమైన విజువల్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్తో గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది’ అని అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.