న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్కు రెగ్యులేటరీ అప్రూవల్ ఇచ్చిన తొలి దేశంగా రష్యా నిలిచిన సంగతి తెలిసిందే. వచ్చే వారంలో 40 వేల మందిపై స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ట్రయల్స్ చేయాలని సోవియట్ యూనియన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ను భారీస్థాయిలో ఉత్పత్తి చేయడంపై రష్యా దృష్టి సారించింది. వ్యాక్సిన్ ఉత్పత్తి కోసం ఇండియాతో జట్టు కట్టాలని రష్యా సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. వ్యాక్సిన్ ఉత్పత్తి మీద ఇండియా సామర్థ్యంపై రష్యా నమ్మకంగా ఉన్నట్లు తెలిసింది. స్పుత్నిక్ వీ సహాయం కోసం ఎదురు చూస్తోందని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) సీఈవో కిరిల్ దిమిత్రియేవ్ చెప్పారు. అత్యుత్తమ ప్రొడక్షన్ కెపాసిటీ కలిగిన దేశాల్లో ఇండియా ఒకటని కిరిల్ పేర్కొన్న కిరిల్.. వ్యాక్సిన్ ఉత్పత్తి కీలకమని, దీని కోసం ఇండియన్ కంపెనీలతో భాగస్వామ్యానికి యత్నిస్తున్నామని పేర్కొన్నారు.
‘మేం క్షుణ్నంగా అధ్యయనం చేశాం. మా సామర్థ్యాలను అంచనా వేశాం. ఈ విషయంలో ఇండియా, బ్రెజిల్, సౌత్ కొరియా, క్యూబా లాంటి దేశాలకు అద్భుతమైన ఉత్పత్తి సామర్థం ఉంది. వీటిలో నుంచి ఏ దేశం స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ సృష్టికి ఇంటర్నేషనల్ హబ్గా మారుతుందో చూడాలి. ఇండియన డ్రగ్ ప్రొడ్యూసర్స్ మాతో సహ భాగస్వామిగా ఉంటారేమో చూడాలి. గమలెయా ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఇండియాకు ఉందని మేం విశ్వసిస్తున్నాం. అయితే ఈ భాగస్వామ్యం మాకు వచ్చిన డిమాండ్కు తగ్గస్థాయిలో ప్రొడక్షన్ చేయగలగాలి’ అని కిరిల్ వివరించారు.