
లాన్సెట్ జర్నల్ స్టడీలో వెల్లడి
మాస్కో: ‘ట్రయల్స్ లేకుండానే వ్యాక్సిన్ ను విడుదల చేయడమా? దాని సేఫ్టీ మాటేంటి.. అది పనిచేస్తుందన్న గ్యారెంటీ ఏంటి?’.. ఇదీ వ్యాక్సిన్ను రష్యా విడుదల చేసినప్పుడు అమెరికా సహా ప్రపంచ దేశాలు వేసిన ప్రశ్న. కానీ, ఇప్పుడు ఆ వ్యాక్సిన్ సేఫ్ అని లాన్సెట్ స్టడీ తేల్చింది. ట్రయల్స్ లో దానిని వేసుకున్న వలంటీర్లలో యాంటీ బాడీలు బాగా డెవలప్ అయ్యాయని, ఇమ్యూనిటీ పెరిగింది. గురువారం ఆ స్టడీ వివరాలను లాన్సెట్ విడుదల చేసింది. అందరిలో యాంటీ బాడీలు ఆగస్టు 11న స్పుత్ నిక్V వ్యాక్సి న్ను రష్యా విడుదల చేసిన సంగతి తెలిసిం దే. ఫేజ్1, ఫేజ్2 ట్రయల్స్ చేసినా ఆ డేటాను విడుదల చేయలేదు. ఫేజ్3 ట్ర యల్స్ అప్పటికి మొదలుపెట్టనే లేదు. దీంతో ఎన్నె న్నో విమర్శలు వచ్చాయి. అయితే, తాజాగా ఫేజ్1, ఫేజ్2లో వచ్చిన ఫలితాలను లాన్సెట్ జర్నల్ పబ్లిష్ చేసింది. 76 మందిపై వ్యాక్సి న్ ట్రయల్స్ చేశారు. ఏడీ26, ఏడీ5 అనే రెండు కాంబో వ్యాక్సిన్లు ఇచ్చి 42 రోజుల పా టు అ బ్జ ర్వేష న్లో ఉంచారు. 21 రోజుల్లోనే వ లంటీర్లందరిలోనూ యాంటీ బాడీలు డెవలప్ అయ్యాయని లాన్సెట్ వెల్ల డించింది. అంతే గాకుండా 28 రోజుల్లో టీ సెల్ రెస్పాన్స్ వచ్చిందని తేల్చింది. ఇమ్యూనిటీకి ప్రధానమైన యాంటీబాడీ డెవలప్మెంట్ తోపాటు, ఇమ్యూన్ మెమొరీకి కీలకమైన టీ సెల్ రెస్పాన్స్ వ్యాక్సి న్ ప్రొడ్యూస్ చేసిందని పేర్కొంది. అయితే, బూస్ట ర్ డోసులతో ఎలాంటి ప్ర యోజనమూ ఉండకపోవచ్చని స్ట డీకి నేతృత్వం వహించిన గమాలీయా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాల జీ సైంటిస్ట్డెనిస్లొగునోవ్చెప్పారు. వ్యాక్సినేషన్తో వచ్చిన ఇమ్యూనిటీని తేల్చేందుకు ఆల్రెడీ వైరస్ సోకి ఇమ్యూనిటీ వచ్చిన వాళ్లప్లాస్మాల్లోనియాంటీ బాడీలతో పోల్చారు సైంటిస్టులు. 4,817 మంది ప్లాస్మాతో పోల్చి చూసినప్పుడు.. సహజంగా వచ్చేఇమ్యూనిటీకి సమానంగా వ్యాక్సినేషన్తో ఇమ్యూనిటీ పెరిగిందని గుర్తించారు. వ్యాక్సి న్ ఇచ్చిన మొదట్లోకొందరిలో తలనొప్పి, వికారం, జ్వరం, నీరసం, నొప్పులు వంటి సైడ్ఎఫెక్స్ ట్ వచ్చినట్టు తేల్చారు.
త్వరలోనే ఫైజర్ రిజల్ట్స్
ఫైజర్వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ ట్రయల్స్ రిజల్స్ ను వచ్చే నెలలో విడుదల చేస్తామని కంపెనీ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా చెప్పారు. ప్రస్తుతం 23 వేల మందిపై ప్రపంచ వ్యాప్తంగా 120 సైట్లలో ఫేజ్ 3 ట్రయల్స్ చేస్తున్నామన్నారు. అక్టోబర్ చివరి నాటికి ఫేజ్3కి సంబంధించిన ఫస్ట్ రిజల్ట్స్ ను వచ్చేఅవకాశం ఉందన్నారు. మంచి రిజల్స్ వస్తే వ్యాక్సిన్ వాడకం కోసం ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్డీఏ)కి దరఖాస్తు చేస్తామన్నారు. ఇప్పటికే దానికి సంబంధించిన డాక్యుమెంట్లను రెడీ చేస్తున్నట్టు వివరించారు. వ్యాక్సి న్ ప్రోగ్రెస్ పై చర్చించేందుకు అక్టోబర్22న ఎఫ్ డీఏ సమావేశం కానుంది. జర్మనీకి చెందిన బయోఎన్టెక్ అనే సంస్థతో కలిసి ఫైజర్ వ్యాక్సిన్ ను తయారు చేస్తోంది. నవంబర్ 1కి వ్యాక్సిన్ ఇస్తామని గవర్నర్లకు సీడీసీ చీఫ్ రాసిన లెటర్ బయటకొచ్చిన తర్వాతి రోజే.. ఫైజర్ ఈ కామెంట్ చేయడం గమనార్హం.