శవాల కింద మందుపాతర్లు పెట్టి పోతున్రు

శవాల కింద మందుపాతర్లు పెట్టి పోతున్రు

కీవ్: రష్యన్ బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఇతర సిటీల నుంచి వెనుదిరుగుతూ.. శవాల కింద మందుపాతర్లు పెట్టి పోతున్నాయని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ మండిపడ్డారు. ఎక్కడ ఏ మందుపాతర పేలుతుందో తెలియక.. సాధారణ ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదన్నారు. రష్యన్ బలగాలు తూర్పు ఉక్రెయిన్ పై ఫోకస్ పెట్టినప్పటికీ, దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో మైన్​లను వరకు సురక్షితం కాదని ఆయన శనివారం ఓ వీడియో సందేశంలో ప్రజలను హెచ్చరించారు. రష్యన్ బలగాలు తూర్పు దిశగా ఫోకస్ పెడుతుండటంతో రానున్న రోజుల్లో పోరాటం మరింత తీవ్రం కావొచ్చని చెప్పారు. రష్యా బలగాల షెల్లింగ్ పూర్తిగా ఆగేదాకా అందరూ వెయిట్ చేయాలని సూచించారు. మరోవైపు మరియుపోల్ సిటీలో చిక్కుకున్న బాధితులను తరలించేందుకు తాము ప్రయత్నించగా వీలుకావడంలేదని శనివారం రెడ్ క్రాస్ సంస్థ ప్రకటించింది. ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలోని క్రీమియా నుంచి రష్యాను కలిపే ప్రాంతంలో మరియుపోల్ ను రష్యా అధీనంలోకి తీసుకుంది.