మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా రైతు భరోసా సంబరాలు

మహబూబ్ నగర్  జిల్లాలో ఘనంగా రైతు భరోసా సంబరాలు

నాగర్ కర్నూల్, వెలుగు:  ఉమ్మడి మహబూబ్ నగర్  జిల్లా వ్యాప్తంగా మంగళవారం రైతు భరోసా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు.  నాగర్ కర్నూల్ జిల్లాలో 9 రోజుల్లోనే 2,92,539 మంది రైతుల ఖాతాల్లోకి 394.381 కోట్ల రూపాయలు జమ చేశామని తెలిపారు. తాడూరు మండలం ఇంద్రకల్ వ్యవసాయ రైతు వేదికల్లో   రైతు విజయోత్సవ  సంబరాల్లో ఆదర్శ రైతులతో కలిసి కలెక్టర్ సంతోష్ పాల్గొన్నారు. 

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : రైతు భరోసా అందడంతో అన్నదాతలు సంతోషంగా ఉన్నారని మహబూబ్ నగర్ జిల్లా లైబ్రరీ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు.  మంగళవారం మహబూబ్‌‌‌‌నగర్ రూరల్ మండలంలోని బొక్కలోనిపల్లి చౌరస్తాలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మల్లు నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫొటోకు పాలాభిషేకం చేసి రైతు సంబరాలు చేసుకున్నారు. 

వంగూరు, వెలుగు:  చారకొండ మండల కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో  రైతులు పెద్ద ఎత్తున రైతు భరోసా సంబరాలు చేసుకున్నారు.  సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీకృష్ణ  ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. మండలంలో 9600 మంది రైతులకు రూ. 12 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో పడినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.