
రాయికోడ్, వెలుగు: రైతు భరోసా కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన సందర్భంగా మంగళవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలాజీ నర్సింలు ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ నుంచి రైతు వేదిక వరకు ర్యాలీ నిర్వహించారు. బసవేశ్వర చౌకు వద్ద సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ ఫ్లెక్సీలకు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు అంజయ్య ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్నాయకులు పాల్గొన్నారు.