
రెజీనా కసాండ్రా, నివేదా థామస్ మెయిన్ లీడ్ లో యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'శాకిని డాకిని'. కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. సురేష్ బాబు, గురు ఫిలింస్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగాఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 16న చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు.
Double the fun ✨
— Suresh Productions (@SureshProdns) August 16, 2022
Double the action ⚡
Shalini and Damini are here to slay! #SaakiniDaakini #SDonSep16th @sudheerkvarma @SunithaTati @ReginaCassandra @i_nivethathomas @sbdaggubati @gurufilms1 @MikeyMcCleary1 @rip_apart @kross_pictures @vijaydonkada pic.twitter.com/D3SKuiVjwY
ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్లో డేర్డెవిల్ లేడీస్ రెజీనా, నివేదా చాలా సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. కిడ్నాప్ డ్రామా బ్యాక్ డ్రాప్లో వస్తోన్న ఈ సినిమా పైన ప్రేక్షకులలో మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాకు రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ ఎంసీ క్లియరీ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు.