- ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఇంటర్ స్టూడెంట్స్ను ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్స్కు రెడీ చేసేందుకు ఫ్రీగా ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సోమవారం హైదరాబాద్లో ఎంసెట్, నీట్, జేఈఈ, సీఏసీపీటీ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కోసం ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని విద్యాశాఖ సెక్రటరీ వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు సెక్రెటరీ ఉమర్ జలీల్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్ సెకండియర్ పూర్తయిన విద్యార్థులు ఉచిత శిక్షణా కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. నిరుడు ఆన్లైన్ ట్రైనింగ్ లో తెలుగు రాష్ర్టాలతో పాటు ఇతర రాష్ర్టాల విద్యార్థులూ పేర్లు నమోదు చేసుకున్నారని గుర్తుచేశారు. http://tscie.rankrs.io లింక్ ద్వారా పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు.