సచిన్ కు సంబంధించిన ఆ న్యూస్ నిజం కాదు

సచిన్ కు సంబంధించిన ఆ న్యూస్ నిజం కాదు

న్యూఢిల్లీ: లెజెండ్స్‌‌‌‌ లీగ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ (ఎల్ఎల్‌‌‌‌సీ) ఈవెంట్‌‌‌‌లో  ఇండియా బ్యాటింగ్‌‌‌‌ గ్రేట్‌‌‌‌ సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌ పార్టిసిపేట్‌‌‌‌ చేయడం లేదు. ఈ విషయాన్ని ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌టీ స్పోర్ట్స్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ శనివారం స్పష్టం చేసింది. రిటైరైన ప్లేయర్లు ఆడే  ప్రొఫెషనల్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ లీగ్‌‌‌‌ అయిన ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌సీ ఈ నెల 20న స్టార్ట్​ అవనుంది. ఈ ఈవెంట్‌‌‌‌లో  మూడు టీమ్స్‌‌‌‌ పోటీ పడతాయి. ఇందులో ఒకటైన ఇండియా మహరాజాస్‌‌‌‌  టీమ్‌‌‌‌ను ఈ మధ్యే ప్రకటించారు. లీగ్‌‌‌‌కు ప్రమోషన్‌‌‌‌ కూడా మొదలైంది. అయితే,  అమితాబ్‌‌‌‌ బచ్చన్‌‌‌‌ ఉన్న  లీగ్‌‌‌‌ ప్రమోషనల్‌‌‌‌ వీడియోలో సచిన్‌‌‌‌ కూడా ఎల్‌‌‌‌ఎల్‌‌‌‌సీలో ఆడతాడని చూపించారు. కానీ, సచిన్‌‌‌‌ వ్యవహారాలు చూసే ఎస్‌‌‌‌ఆర్‌‌‌‌టీ స్పోర్ట్స్‌‌‌‌ దీన్ని ఖండించింది. లెజెండ్స్‌‌‌‌ లీగ్​ క్రికెట్‌‌‌‌లో సచిన్‌‌‌‌ పార్టిసిపేషన్‌‌‌‌ గురించి వస్తున్న న్యూస్‌‌‌‌ నిజం కాదని చెప్పింది. క్రికెట్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌ను, అమితాబ్‌‌‌‌ బచ్చన్‌‌‌‌ను ఆర్గనైజర్స్‌‌‌‌ ఇలా తప్పుదోవ పట్టించడం సరికాదని పేర్కొంది.