
న్యూఢిల్లీ: వన్డే వరల్డ్ కప్ మాదిరిగా.. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ కూడా నాలుగేళ్లకు ఓసారి నిర్వహించాలని ఇండియా లెజెండ్ సచిన్ టెండూల్కర్ సూచించాడు. ఇందుకు రెండు, మూడు నెలల విండో కేటాయించాలని ఐసీసీని కోరాడు. ‘డబ్ల్యూటీసీకి ఆదరణ పెంచితే.. వరల్డ్కప్లాగా అవుతుంది. వరల్డ్కప్ అన్ని దేశాల్లో నిర్వహించడం లేదు. ఒకటి, రెండు దేశాల్లోమాత్రమే ఆడతారు. అలాగే టెస్ట్ చాంపియన్షిప్ను నిర్వహించే దేశాలనును కూడా డిసైడ్ చేయాలి. రెండు నెలల టైమ్లో చాంపియన్షిప్ను కంప్లీట్ చేసే విధంగా షెడ్యూల్ను తయారు చేయాలి. అన్ని జట్లు పరస్పరం మ్యాచ్లు ఆడాలి. అప్పుడు ఫైనల్స్ను సింగిల్గా నిర్వహించినా పెద్దగా ఇబ్బంది ఉండదు’ అని సచిన్ అభిప్రాయపడ్డాడు.