సాగర్ జల వివాదాలను పరిష్కరించాలి : తమ్మినేని వీరభద్రం

సాగర్ జల వివాదాలను పరిష్కరించాలి :   తమ్మినేని వీరభద్రం

హైదరాబాద్, వెలుగు :  ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నాగార్జునసాగర్ జల వివాదాల్లో వాస్తవాలను పరిగణనలోకి తీసుకొని, సమస్యను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరారు. ఈ ఏడాది వర్షాలు లేక నాగార్జునసాగర్‌‌లో 18 టీఎంసీల నీరు మాత్రమే ఉందని గుర్తుచేశారు. 

ఇంతకాలం వినియోగించుకున్నట్టుగానే ఈ నీటిని కృష్ణా రివర్ బోర్డు అనుమతితో ఉభయ తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవాలని సూచించారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్న సమయంలో డ్యామ్‌పై వివాదం మొదలైందని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం ఆలసత్వం ప్రదర్శించిందని విమర్శించారు. ఇప్పటికైనా రంగంలోకి దిగిన కేంద్రం సమస్యను బాధ్యతాయుతంగా పరిష్కరించాలని తమ్మినేని కోరారు.