గంటలో రావడానికి సక్సెస్.. స్విగ్గీ ఆర్డర్ కాదు : చిత్రలహరి ట్రైలర్

గంటలో రావడానికి సక్సెస్.. స్విగ్గీ ఆర్డర్ కాదు : చిత్రలహరి ట్రైలర్

సాయి ధరమ్ తేజ్‌ కథానాయకుడిగా కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రం ‘చిత్రలహరి’. కల్యాణి ప్రియదర్శన్‌, నివేదా పేతురాజ్‌  హీరోయిన్లు. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించి చిత్ర ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేశారు.

“స్విగ్గీలో పెట్టిన ఆర్డరా కృష్ణారావు.. ఇంట్లో కూర్చుంటే గంటలో రావడానికి.. సక్సెస్. టైమ్ పడుతుంది”,   ‘ఒకే దిక్కున ఉదయించే సూర్యుడు నాలుగు దిక్కులు ఉదయించినా ఇంత వెలుతురు కూడా రాని జీవితం నాది. ఎందుకంటే చీకటికి చిరునామా నేను..’ , “ప్లేట్ సక్సెస్ కావాలి.. తీసుకురాపో” లాంటి డైలాగులు ఆకట్టుకుంటాయి.

ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్, మోహన్ లు నిర్మాతలు. ఏప్రిల్‌ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.