వర్క్‌‌‌‌ మోడ్‌‌‌‌లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్

వర్క్‌‌‌‌ మోడ్‌‌‌‌లోకి వచ్చిన సాయి ధరమ్ తేజ్

కమర్షియల్ హీరోగా నిలదొక్కుకున్నా.. అప్పుడప్పుడు కొత్త తరహా స్ర్కిప్టులు కూడా సెలెక్ట్ చేసుకుంటూ మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు సాయిధరమ్ తేజ్. లాస్ట్ ఇయర్ ‘రిపబ్లిక్’ మూవీతో మంచి మార్కులు వేయించుకున్నాడు. అయితే ఆ తర్వాత యాక్సిడెంట్‌‌‌‌ కారణంగా కొంత గ్యాప్ తీసుకున్నాడు. రీసెంట్‌‌‌‌గా తిరిగి వర్క్‌‌‌‌ మోడ్‌‌‌‌లోకి వచ్చాడు. ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. సుకుమార్ కథ, స్ర్కీన్‌‌‌‌ప్లే రాస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్‌‌‌‌తో కలిసి బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అజనీష్ లోక్‌‌‌‌నాథ్ సంగీతం అందిస్తున్నాడు.

నిన్న తేజ్ పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ అప్‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిందని,  అతి త్వరలోనే టైటిల్‌‌‌‌ రివీల్ చేయడంతో పాటు స్నీక్ పీక్ వీడియోని కూడా వదులుతామని ప్రకటించారు. అంతే కాదు.. ఈ చిత్రాన్ని నెక్స్ట్ ఇయర్ వేసవి కానుకగా విడుదల చేయనున్నట్టు కన్‌‌‌‌ఫర్మ్ చేశారు. ఈ మిస్టిక్ థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌లో సంయుక్త మీనన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.