Sai Pallavi: ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యాడ్స్లో నటించను.. సాయి పల్లవి డెసిషన్కి ఫ్యాన్స్ ఫిదా

Sai Pallavi: ఎన్ని కోట్లు ఇచ్చినా ఆ యాడ్స్లో నటించను.. సాయి పల్లవి డెసిషన్కి ఫ్యాన్స్ ఫిదా

లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి(Sai Pallavi)కి యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. సినిమాలకన్నా ఆమె బిహేవియర్ నే చాలా మంది ఇష్టపడతారు. మామూలు కమర్షియల్, గ్లామర్ సినిమాలకు ఆమె దూరంగా ఉంటారు. ఏదైనా సినిమా ఈవెంట్స్ కి వచ్చినా పద్దతిగా చీర కట్టుకొని వస్తారు సాయి పల్లవి. అందుకే.. ఆమె అంటే అందరూ గౌరవంగా చూస్తారు. 

తాజాగా అలాంటి మరో పనిచేశారు సాయి పల్లవి. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సాయి పల్లవికి ప్రస్తుతం ఉన్న క్రేజ్ కి ఆమెను తమ బ్రాండ్స్ కి అంబాసిడర్ గా చేయాలనీ చాలా కాస్మెటిక్  కంపెనీలు ఆమెను సంప్రదించాయట. అయితే.. సాయి పల్లవి డాక్టరేట్ చేశారు కాబట్టి వాటివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ గురించి ఆమెకు తెలుసు. అందుకే అలాంటి ప్రాడక్ట్స్ కి ఎన్ని కోట్లు ఇచ్చినా ప్రమోట్ చేయనని చెప్పేశారట. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సాయి పల్లవి. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నాగ చైతన్య హీరోగా వస్తున్న తండేల్ సినిమా చేస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా వస్తున్న ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఏ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ.