
ప్రెసిడెంట్గా సంజయ్ సింగ్ గెలవడాన్ని నిరసిస్తూ స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ కెరీర్కు గుడ్ బై చెప్పింది. ‘మేం మహిళా ప్రెసిడెంట్ గెలవాలని కోరుకున్నాం. అది సాధ్యం కాలేదు. బ్రిజ్కు వ్యతిరేకంగా చాలా ఆందోళనలు చేశాం. అవి కూడా ఫలించలేదు. ఇప్పుడు బ్రిజ్ సన్నిహితుడే డబ్ల్యూఎఫ్ఐ చీఫ్గా రావడంతో నేను కెరీర్ను వదిలేస్తున్నా. గత కొన్ని నెలలుగా మేం చేస్తున్న పోరాటం వృథా అయ్యింది’ అని కన్నీటి పర్యంతమైన సాక్షి పేర్కొంది. బజ్రంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ కూడా ఫలితాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.