డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న రిలీజ్ కానున్న ‘సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’

డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న రిలీజ్ కానున్న  ‘సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’

ఈ ఏడాది ప్రారంభంలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన శ్రుతిహాసన్.. సంక్రాంతి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు విజయాలు అందుకుంది. ప్రస్తుతం ప్రభాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జంటగా ‘సాలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో నటిస్తున్న ఆమె, తాజాగా మరో తెలుగు సినిమాకు కమిట్ అయింది. నాని హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటిస్తోంది. ఈ సినిమాలోనే శ్రుతిహాసన్ కూడా నటిస్తోంది.

శనివారం ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ఓ కీలకపాత్రని ఆమె ఇందులో పోషించబోతోందని చెప్పారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరుగుతోంది. ఈ లెంగ్తీ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కీలక సన్నివేశాలు తీస్తున్నారు. శ్రుతి కూడా గోవా షెడ్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జాయిన్ అయింది. హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బిగ్ బడ్జెట్ మూవీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్న ఆమె, ఇందులో స్పెషల్ రోల్ చేస్తుందంటే కచ్చితంగా ఇది ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్ అని అర్థమవుతోంది. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 21న సినిమా రిలీజ్ కానుంది.