
సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో సలీమ్ మాలిక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘దర్జా’. పైడిపాటి శివశంకర్ నిర్మిస్తున్నారు. ఆమని, షకలక శంకర్, ఛత్రపతి శేఖర్, సమీర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ను నిన్న ప్రసాద్ ల్యాబ్స్లో రిలీజ్ చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, నిర్మాత కే ఎల్ నారాయణ తదితరులు పాల్గొని సినిమా మంచి హిట్ అవ్వాలంటూ టీమ్కి విషెస్ చెప్పారు. యూనిట్ మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొంది.