రాధే సినిమాను పైరసీ చేసిన వారిని వదిలిపెట్టను

రాధే సినిమాను పైరసీ చేసిన వారిని వదిలిపెట్టను

ముంబై: బాలీవుడ్ బిగ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే రీసెంట్‌గా రిలీజైంది. జీ5, జీ ప్లెక్స్ ఓటీటీతోపాటు డిష్ టీవీ, టాటా స్కై, ఎయిర్ టెల్ డిజిటల్ టీవీ వేదికగా డీటీహెచ్‌లోనూ విడుదలైంది. అయితే అప్పుడే ఈ సినిమా పలు వెబ్ సైట్లలో లీకైంది. రాధే మూవీ పైరసీకి గురవ్వడంపై సల్లూ భాయ్ సీరియస్ అయ్యాడు. మూవీని పైరసీ చేసిన వారిని వదిలిపెట్టమని హెచ్చరించాడు. తమ చిత్రాన్ని పైరసీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ సెల్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాను కేవలం రూ.249కే పే పర్ వ్యూ పద్ధతిలో వీక్షించేందుకు ముందుకు తెచ్చామని చెప్పాడు. రాధేను చట్ట విరుద్ధంగా చూస్తే నేరం చేసినట్లేనన్నాడు.