ఐపీఎల్ 19 నాకౌట్ సమరం స్టార్ట్ అయ్యింది. క్వాలిఫయర్ 1లో భాగంగా మంగళవారం (మే 26) ఆర్సీబీ, గుజరాత్ జట్లు తలపడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల వేదికగా జరుగుతోన్న ఈ కీలక మ్యాచులో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
అయితే, ఈ కీలకమైన మ్యాచులో ఆర్సీబీ జట్టులో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ను జట్టులోకి తీసుకోకపోవడం గమనార్హం. సాల్ట్ స్థానంలో ఓపెనర్గా ఇన్ఫామ్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్కు స్థానం కల్పించారు. ఇక, అంచనాల మేర రాణించడంలో విఫలమవుతున్న రొమారియో షఫర్డ్ను ప్లేయింగ్ లెవన్ నుంచి తప్పించింది ఆర్సీబీ.
అతడి స్థానంలో స్టార్ పేసర్ జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. కీలకమైన క్వాలిఫయర్ మ్యాచుకు విధ్వంసకర సాల్ట్ను పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆర్సీబీ ప్లేయింగ్ లెవన్ను పరిశీలిస్తే బౌలింగ్ లైనప్ను పటిష్టం చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే భువనేశ్వర్, హేజిల్ వుడ్, రసిఖ్ సలాందార్లతో పేస్ దళం బలంగా ఉండగా.. వీళ్లకు తోడు జాకబ్ డఫీని జట్టులోకి తీసుకున్నారు.
