టీవీలకు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. టీవీలపై భారీ ఆఫర్లు ప్రకటించిన శామ్ సంగ్

టీవీలకు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. టీవీలపై భారీ ఆఫర్లు ప్రకటించిన శామ్ సంగ్

హైదరాబాద్, వెలుగు: కన్స్యూమర్​ఎలక్ట్రానిక్స్​బ్రాండ్ శామ్​సంగ్ పండుగల సందర్భంగా సూపర్​బిగ్​సెలబ్రేషన్స్‎ను ప్రకటించింది. వీజన్​ ఏఐతో పనిచేసే ప్రీమియం బిగ్​స్క్రీన్​టీవీలపై ఈ ఆఫర్లు ఉంటాయి. వచ్చే నెల 31 వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పాటు ప్రత్యేక ఆఫర్లు, క్యాష్​బ్యాక్లు,​బహుమతులు పొందవచ్చు. ఈఎంఐలు నెలకు రూ. 990 నుంచి ప్రారంభమవుతాయి. 

జీరో డౌన్​ పేమెంట్​సదుపాయాన్ని వాడుకోవచ్చు. కొన్ని స్కీముల్లో ఒక ఈఎంఐ మినహాయింపు ఆఫర్​ఉంటుంది. కొన్ని మోడల్స్​బిగ్​స్క్రీన్​ టీవీ మోడల్స్​కొనుగోలుదారులకు ఉచితంగా శామ్​సంగ్​సౌండ్​బార్​ (రూ. 92,990 వరకు విలువైనది) లేదా ఏఐ టీవీ (రూ. 1,40,490 వరకు విలువైనది) లభిస్తుంది. కొన్ని బిగ్​స్క్రీన్​టీవీలపై 3 సంవత్సరాల వారంటీని పొందవచ్చు. ఈ ఆఫర్లు 55, 65, 75, 85, 98, 100, 115 ఇంచుల విజన్​ ఏఐ టీవీలకు వర్తిస్తాయి.