సెల్​బేలో శామ్​సంగ్​ జెడ్ ప్లిప్ 5, జెడ్  ఫోల్డ్5 ఫోన్లు

సెల్​బేలో శామ్​సంగ్​ జెడ్ ప్లిప్ 5, జెడ్  ఫోల్డ్5 ఫోన్లు

హైదరాబాద్​, వెలుగు: శామ్​సంగ్​ లేటెస్ట్​ ఫోన్లు జెడ్ ప్లిప్ 5, జెడ్  ఫోల్డ్ 5 మోడల్  ఫోన్స్ మొబైల్​రిటైలర్​ సెల్​బే ద్వారా అందుబాటులోకి వచ్చాయి. నగరంలోని గచ్చిబౌలి సెల్ బే స్టోర్​లో వీటిని టాలీవుడ్ నటి వర్షిణి సౌందరరాజన్, సెల్​బే ఎండీ సోమ నాగరాజు, శామ్​సంగ్​ దక్షిణాది రీజనల్ సేల్స్ మేనేజర్ సుమిత్ కుక్రెజా లాంచ్​ చేశారు. ఈ  సందర్భంగా  వర్షిణి మాట్లాడుతూ  మారుతున్న టెక్నాలజీ, నేటి తరం అవసరాలకు అనుగుణంగా శామ్​సంగ్​ సంస్థ ఎప్పటికప్పుడు  సరికొత్త ఫీచర్స్ తో మొబైల్ ఫోన్స్ ను అందిస్తున్నదని తెలిపారు.

మొబైల్ ఫోన్  లగ్జరీ వస్తువు కాదని, ఇప్పుడు  ఎసెన్షియల్ కమోడిటీగా మారిందని అన్నారు. నాగరాజు మాట్లాడుతూ కస్టమర్లకు విభిన్న రకాల మొబైల్ ఫోన్స్ ను అందించడంలో ముందుటామన్నారు. వినియోగదారుల ఆధారాభిమానాలతో సెల్ బే ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుందన్నారు. సెల్ బే డైరెక్టర్ సుహాస్ నల్లచెరు మాట్లాడుతూ శామ్​సంగ్​ కొత్త సిరీస్ ఫోన్లకు ఎంతో డిమాండ్ ఉందన్నారు.  వీటిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయని, కస్టమర్లకు ఇవి ఎంతో నచ్చుతాయని సెల్ బే డైరెక్టర్ సుదీప్ నల్లచెరు ఈ సందర్భంగా తెలిపారు.