అడ్డుకుంటున్నాడని లారీతో తొక్కించిన ఇసుక మాఫియా

అడ్డుకుంటున్నాడని లారీతో తొక్కించిన ఇసుక మాఫియా

మహబూబ్ నగర్ రాజాపూర్ మండలం తిర్మలపూర్ గ్రామ సమీపంలో దారుణం జరిగింది. ఇసుక రవాణా అడ్డుకుంటున్నాడని ఇసుక మాఫియా ఓ వ్యక్తిని లారీతో తొక్కించి చంపారు. గ్రామానికి చెందిన గుర్రం కాడి నరసింహులు అనే వ్యక్తి బుధవారం రాత్రి తన పంట పొలాల్లో నుంచి ఇసుక అక్రమ రవాణా చేయోద్దని లారీలను అడ్డగించాడు. దాంతో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. నరసింహులుని లారీతో గుద్ది తొక్కించారు. తీవ్ర గాయాలపాలైన నరసింహులు అక్కడికక్కడే మృతిచెందాడు. గత సంవత్సరం కూడా ఇసుక మాఫియా అదే గ్రామంలో ఒక రైతుని ఇసుక దిబ్బ కూల్చి హత్య చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన పై కోపోద్రిక్తులైన గ్రామస్తులు మూకుమ్మడిగా లారీపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. నరసింహులు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళనదిగారు.

For More News..

కాంగ్రెస్ మొదలుపెట్టిందని.. టీఆర్ఎస్ పూర్తి చేయట్లే..

అన్నా.. రాఖీ పంపుతున్నా.. నేను రావట్లే..

సెక్రటేరియట్‌ ‌డిజైన్‌లో మార్పులు