
హైదరాబాద్, వెలుగు: టీఎస్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో( టీ న్యాబ్) డైరెక్టర్గా సందీప్ శాండిల్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల టైమ్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో భాగంగా సీవీ ఆనంద్ బదిలీ అయిన తర్వాత సిటీ సీపీగా సందీప్ శాండిల్య బాధ్యతలు నిర్వహించారు.
అయితే ఇటీవల జరిగిన బదిలీల్లో ఆయనను టీ న్యాబ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సందీప్ శాండిల్య టీ న్యాబ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. ఎస్పీ సునీతా రెడ్డి సహా సిబ్బంది ఆయనకు బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు.