
ఝరాసంగం.వెలుగు: అనుమతులు లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న మహాపాలి క్లినిక్ను సంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ నాగ నిర్మల సీజ్చేశారు. మంగళవారం ఝరాసంగం మండల కేంద్రంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఆర్ఎంపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్లినిక్లో ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రథమ చికిత్స మాత్రమే చేయాల్సిన ఆర్ఎంపీ క్లినిక్లో బెడ్లు ఏర్పాటు చేసి రోగులను అడ్మిట్ చేసుకుని అనుమతి లేని అల్లోపతి వైద్యం చేయడం నియమాలకు విరుద్దమన్నారు. దీంతో మహాపాలి క్లినిక్ను సీజ్ చేశామన్నారు. అక్కడి నుండి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న ల్యాబ్ను పరిశీలించారు. అనంతరం రికార్డులు తనిఖీ చేశారు. ఆమె వెంట స్థానిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు రమ్య, ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.