జహీరాబాద్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. ఐదు షాపుల్లో ఒకేసారి చోరీ

జహీరాబాద్లో అర్ధరాత్రి దొంగల బీభత్సం.. ఐదు షాపుల్లో ఒకేసారి చోరీ

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. మార్కెట్ ఏరియాలోని ఐదు షాపుల్లో ఒకేసారి దొంగతనం చేశారు. షెట్టర్లు పగలగొట్టి షాపుల్లో ఉన్న నగదు, విలువైన సామగ్రిని ఎత్తుకెళ్లారని స్థానికులు తెలిపారు.

ఈ సమాచారాన్ని షాపుల నిర్వహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.