గాంధీ భవన్లో రేవంత్, జగ్గారెడ్డి సరదా సంభాషణ

గాంధీ భవన్లో రేవంత్, జగ్గారెడ్డి సరదా సంభాషణ

హైదరాబాద్: శుక్రవారం గాంధీ భవన్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీసాలను టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మెలి తిప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇవాళ గాంధీ భవన్ లో సమావేశమయ్యారు. ఈ నెల 23న రాష్ట్రంలో రాహుల్ యాత్ర మొదలు కానుండగా... ఆ యాత్రను సక్సెస్ చేయడానికి గల పలు విషయాలపై నేతలు చర్చించారు. మీటింగ్ అనంతరం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఒకరికొకరు తారసపడ్డారు.

ఈ క్రమంలో వారిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. వాళ్లు అలా మాట్లాడుకుంటున్న సమయంలోనే రేవంత్ రెడ్డి... జగ్గారెడ్డి మీసాలను మెలి తిప్పారు. దీంతో  రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి కలిసిపోయారని, ఇది తమ పార్టీకి శుభ పరిణామమని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.