సమంత ప్రకటన నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం : సానియా

సమంత ప్రకటన నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం : సానియా

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒక వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్ లు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోందీ. అంతేకాదు.. అప్పుడప్పుడు యాడ్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే  పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. తాజాగా పెప్సీ కంపెనీ తమ బ్రాండ్ అంబాసిడర్ గా సమంతను ఎంపిక చేసుకుంది. ఇందులో బాగంగా సమంత నటించిన పెప్సీ కమర్షియల్ యాడ్ వీడియోని విడుదల చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.

ఇక ఈ  వీడియో లో మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించిన సమంత.. స్టంట్స్ చేస్తూ షాకిచ్చింది. దీంతో.. ఈ పెప్సీ వీడియో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. ఇక సమంత చేసిన ఈ వైరల్ వీడియో పై టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది.. "ఈ యాడ్ వీడియో చూస్తే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. అమ్మాయివి నీకు  టెన్నిస్ క్రీడ అవసరమా, ఆడి ఏం సాధిస్తుందో అంటూ  చాలా మంది అన్నారు. టెన్నిస్ మహిళలకు సంబంధించిన క్రీడ కాదు. నువ్వు ఎంత దూరం వెళ్లగలవు అన్నారు. కానీ నేను నా కలను సాధించేందుకు కష్టపడ్డాను. నా కలను ఎప్పుడూ వదులుకోలేదు. ఎందుకంటే నన్ను నేను నమ్ముకున్నాను. సమాజం నా గురించి ఏమి మాట్లాడుతుందో నేను పట్టించుకోలేదు. సంకల్పంతో విజయాన్ని సాధించడానికి శక్తితో పైకి లేచాను.

సమంత చేసిన పెప్సీ ప్రకటన నేటి తరం అమ్మాయిలకు ఆదర్శం. తమ కలలను సాధించుకోవడానికి ముందుకు సాగడానికి సరైన ప్రేరణగా నిలుస్తుందని" పోస్ట్ చేసింది సానియా మీర్జా. ప్రస్తుతం సానియా సమంతపై పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.