ఫేర్ వెల్ మ్యాచ్‌లో సానియా విజయం

ఫేర్ వెల్ మ్యాచ్‌లో సానియా విజయం

హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో జరిగిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (ఫేర్ వెల్ మ్యాచ్)ఎగ్జిబిషన్ మ్యాచ్ లో లో విజయం సాధించారు. మ్యాచ్ అనంతరం ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురై, కంటతడి పెట్టారు. ఆ తర్వాత అమ్మ గ్రేట్ అంటూ సానియా కొడుకు ఇజహాన్ తల్లిపై ప్రేమను వ్యక్తం చేయడం అందర్నీ ఆకర్షించింది. 

ఈ మ్యాచ్ కు మంత్రి  కేటీఆర్, నటుడు దుల్కర్ సల్మాన్, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, అజారుద్దీన్ లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మ్యాచ్ జరుగుతుండగా యువరాజ్ ను చూసి ఎక్సైటింగ్ గా ఫీలైన అభిమానికి క్యాప్ మీద సంతకం ఇచ్చి యూవీ అనందపర్చారు. ఈ మ్యాచ్ కు సానియా భర్త షోయబ్ మాలిక్ మాత్రం హాజరుకాకపోవడం గమనార్హం.