సంక్రాంతి రైళ్లు అప్పుడే ఫుల్.. IRCTCలో టికెట్లు పెట్టిన 24 గంటల్లోనే క్లోజ్ !

సంక్రాంతి రైళ్లు అప్పుడే ఫుల్.. IRCTCలో టికెట్లు పెట్టిన 24 గంటల్లోనే క్లోజ్ !

సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి దాదాపు మూడు నెలల ముందే జర్నీ కష్టాలు మొదలయ్యాయి. ఏ రైలులో చూసినా ఒక్క సీటు రిజర్వేషన్​ ఖాళీగా లేదు. IRCTCలో సంక్రాంతి రైళ్లకు బుకింగ్స్ ఓపెన్ అయిన 24 గంటల్లోనే టికెట్లు ఆల్ మోస్ట్ బుక్ అయిపోయాయి. ఏపీ వైపు వెళ్లే రైళ్లల్లో  సీట్లన్నీ ఫుల్గా నిండిపోయాయి. ఒక్కో రైలులో వందల్లో వెయిటింగ్​ లిస్ట్​ ఉంది. రైల్వే మరిన్ని స్పెషల్​ ట్రైన్స్​ నడిపితే తప్ప సొంతూరిలో పండుగ చేసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ప్యాసింజర్ల రద్దీని బట్టి స్పెషల్ ట్రైన్స్​నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది.

ప్రతీ సంవత్సరం.. సంక్రాంతి సెలవులు జనవరి రెండో వారం నుంచి మొదలవుతుండగా ఏపీకి వెళ్లేవారు ఇప్పటికే అడ్వాన్స్​బుకింగ్ చేసుకోవడంతో రైళ్లలో సీట్లన్నీ ఫుల్​అయ్యాయి. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వైపు వెళ్లే రైళ్లలో టికెట్లు చాలా వరకూ బుక్ అయిపోయాయి. ఏపీకి వెళ్లే గోదావరి, విశాఖ.. వంటి రెగ్యులర్ రైళ్లు ఫుల్గా బుక్ అయ్యాయి.

సికింద్రాబాద్ ​నుంచి వైజాగ్​, కాకినాడ, నర్సాపూర్​, తెనాలి వైపు వెళ్లే రైళ్లన్నీ ఇప్పటికే ఫుల్ బుకింగ్స్ కావడం కొసమెరుపు. ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల వైపు వెళ్లే రైళ్లలో టికెట్ల కోసం చూస్తున్న వాళ్లకు కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఒడిశా,  బెంగాల్​వైపు వెళ్లే రైళ్లలో కూడా బెర్త్లు ఖాళీగా లేవు. 

గుంటూరు, విజయవాడ లోపు మాత్రమే రైళ్లలో కాస్తోకూస్తో అడ్వాన్స్ బుకింగ్కు అవకాశం ఉంది. సంక్రాంతికి  రైళ్లన్నీ  ఫుల్గా రిజర్వ్​ కావడంతో ఇప్పుడు ప్యాసింజర్లు స్పెషల్ రైళ్ల కోసం వెయిట్​చేస్తున్నారు. స్పెషల్​ రైళ్లు నడిపితే  సీట్​రిజర్వేషన్ ​చేసుకునేందుకు చూస్తున్నామంటున్నారు. ప్రతిసారి సంక్రాంతికి రైల్వే శాఖ ఏపీకి స్పెషల్​ రైళ్లను నడుపుతుంది.