ఓట్ల కోసం వస్తే బాల్క సుమన్కు చీపురు దెబ్బలే : సరోజా వివేక్

 ఓట్ల కోసం వస్తే బాల్క సుమన్కు చీపురు దెబ్బలే : సరోజా వివేక్

మంచిర్యాల జిల్లా : చెన్నూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమనే తమ ఇండ్లు, కార్యాలయాలపై ఐటీ, ఈడీ దాడులు చేయించారని కాంగ్రెస్ అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజా వివేక్ చెప్పారు. సోదాల్లో రెండే చిప్పలు దొరికినై... ఒకటి కేసీఆర్ కు, ఇంకోటి బాల్క సుమన్ కు అని అన్నారు. పదేళ్లుగా కుంభకర్ణుడు మాదిరిగా తిని పడుకున్నావు.. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం నిద్ర లేచినవు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు అడగడానికి వస్తే బాల్క సుమన్ ను చీపురుతో కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

100 కేసులు ఉన్నోడి వైపు ఉంటారా..? వెయ్యి కోట్లు ఉన్నోడి వైపు ఉంటారా..? అని గతంలో బాల్క సుమన్ చెప్పాడు.. ఇప్పుడు అడుగుతున్నాం.. వెయ్యి కోట్లు ఎక్కడకెళ్లి సంపాదించినవు..? అని ప్రశ్నించారు సరోజా వివేక్. డిసెంబర్ 3వ తేదీ తర్వాత ఏ బావిలో దూకుతావో వెళ్లి ప్లాన్ చేస్కో అని బాల్క సుమన్ కు సవాల్ విసిరారు. గతంలో కాకా కుటుంబ వేసిన రోడ్లే ఇప్పటికీ ఉన్నాయని, బీఆర్ఎస్ గవర్నరమెంట్ లో కొత్తగా నిర్మాణం జరగలేదని చెప్పారు.