మా బోనాలను చూసేందుకు ఎట్లొస్తవ్?.. దళితుడిపై సర్పంచ్, అనుచరుల దాడి

మా బోనాలను చూసేందుకు ఎట్లొస్తవ్?..  దళితుడిపై సర్పంచ్, అనుచరుల దాడి

చేవెళ్ల, వెలుగు: బోనాల ఉత్సవాలను చూసేందుకు వచ్చిన దళితుడిపై ఓ గ్రామ సర్పంచ్, అతడి అనుచరులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం పరిధిలోని మల్కాపూర్ గ్రామంలో  శుక్రవారం సాయంత్రం బోనాల పండగ జరిగింది. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బోనాలు చూసేందుకు గుడి దగ్గరకు వెళ్లాడు. గ్రామ సర్పంచ్​ శేరి శివారెడ్డి, అతడి అనుచరులు ఆ వ్యక్తిని అడ్డుకున్నారు. ‘మా బోనాలను చూసేందుకు ఎట్లొస్తవ్’ అంటూ కులం పేరుతో తిట్టి దాడి చేశారు.  

గాయపడ్డ బాధితుడిని  గ్రామస్తులు మొయినాబాద్​లోని ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. శనివారం మధ్యాహ్నం వరకు దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయకపోవడంతో పోలీసుల తీరుపై ప్రజాసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్ల పీఎస్ ఎదుట మెయిన్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు.