శశివదనే మూవీ ఏప్రిల్ 19న రిలీజ్

శశివదనే మూవీ ఏప్రిల్ 19న రిలీజ్

రక్షిత్ అట్లూరి, కోమలీ ప్రసాద్ జంటగా సాయి మోహన్ ఉబ్బర తెరకెక్కిస్తున్న చిత్రం ‘శశివదనే’. అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 19న సినిమా రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో  రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ  ‘సినిమా ఫస్ట్ కాపీ చూసుకుని కాన్ఫిడెంట్‌‌‌‌గా ఉన్నాం. 

అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే ఎమోషన్‌‌‌‌తో పాటు తండ్రి ఎమోషన్‌‌‌‌ని దర్శకుడు బాగా రాశాడు.  ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పాడు. కోమలీ ప్రసాద్ మాట్లాడుతూ ‘మంచి స్టోరీతో పాటు నైంటీస్‌‌‌‌లో ఉండే ఎమోషన్ సినిమాలు చూసి చాలా కాలమైంది. అలాంటి కాన్సెప్ట్‌‌‌‌తో తెరకెక్కిన చిత్రమే శశివదనే. ఈ మూవీ క్లైమాక్స్ గుర్తుండిపోతుంది’ అని చెప్పింది. 

‘సినిమా టైటిల్, పాటలు ఎంతో సాప్ట్‌‌‌‌గా అనిపిస్తున్నాయో సినిమా అంత హార్డ్ హిట్టింగ్‌‌‌‌గా  ఉంటుంది. మూవీ చూసిన తర్వాత ఓ ఆలోచనతో ఆడియెన్స్ బయటకు వస్తారు’ అని డైరెక్టర్ సాయి మోహన్ చెప్పాడు. సినిమా చాలా ఎమోషనల్‌‌‌‌గా ఉంటుందని, అందరికీ నచ్చుతందనే నమ్మకం ఉందని నిర్మాతలు అన్నారు.  చిత్ర సమర్పకురాలు గౌరీ నాయుడు,  ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీపాల్, సినిమాటోగ్రాఫర్ శ్రీసాయి కుమార్ దారా,  కొరియోగ్రాఫర్ జెడి.మాస్టర్ పాల్గొన్నారు.