బీజేపీకి సతీశ్ మాదిగ రాజీనామా

బీజేపీకి సతీశ్ మాదిగ రాజీనామా
  •     రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించిన నేత

హైదరాబాద్, వెలుగు : అచ్చంపేట బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన సతీశ్​మాదిగ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ స్టేట్​ చీఫ్​, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గురువారం పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంత మంది కుట్ర పన్ని తనను ఓడించారని, ఓటమికి గల కారణాలను పార్టీకి వివరించానని పత్రిక ప్రకటనలో తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కోసం ప్రయత్నిస్తుండగా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పారు.

ఆ లెటర్ లో వారంలోగా వివరణ ఇవ్వాలని కోరారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తనకు షోకాజ్ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని వెల్లడించారు. ఆ వివరణతో సంతృప్తి చెందకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. తనను సంప్రదించకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం బాధగా ఉందని, అందుకే పార్టీకి రాజీనామా చేసినట్టు చెప్పారు.