బ్యాడ్మింటన్ ఫ్యాన్స్‌కు షాక్.. ఇండోనేషియా ఓపెన్ నుండి సాత్విక్-చిరాగ్ అవుట్!

బ్యాడ్మింటన్ ఫ్యాన్స్‌కు షాక్.. ఇండోనేషియా ఓపెన్ నుండి సాత్విక్-చిరాగ్ అవుట్!

Satwik Chirag: ఇండియన్ బ్యాడ్మింటన్ సూపర్‌స్టార్స్ సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి ఫ్యాన్స్‌కు ఒక బ్యాడ్ న్యూస్.. ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండోనేషియా ఓపెన్ 2026 (Super 1000) టోర్నమెంట్ మొదటి రౌండ్ నుంచే ఈ వరల్డ్ నంబర్ 4 జంట తప్పుకుంది. మలేషియాకు చెందిన కాంగ్ ఖై జింగ్, ఆరోన్ తాయ్‌లతో జరుగుతున్న మ్యాచ్‌లో సాత్విక్ కుడి భుజం నొప్పితో ఇబ్బంది పడ్డాడు. దీంతో ఆటను మధ్యలోనే ఆపేసి కోర్టు నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. మ్యాచ్ ఆపే సమయానికి సాత్విక్-చిరాగ్ జోడీ 6–11తో వెనుకంజలో ఉంది.

బ్యాడ్మింటన్ అసోసియేషన్ క్లారిటీ: 
సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి  జోడి తప్పుకోవడంపై బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేసింది. సాత్విక్‌కు గాయం కావడంతో ఇండోనేషియా ఓపెన్ నుంచి తప్పుకుంది.. రాబోయే పెద్ద టోర్నమెంట్ల దృష్ట్యా సాత్విక్ త్వరగా కోలుకోవడానికి, రీహాబిలిటేషన్ పైనే ఇప్పుడు టీమ్ ఫోకస్ పెట్టబోతోంది. సాత్విక్ స్పీడీగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నామని పేర్కొంది.  

గత కొన్ని వారాలుగా సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ బ్యాక్-టు-బ్యాక్ మ్యాచ్‌లతో ఫుల్ బిజీగా ఉంది. జస్ట్ కొన్ని రోజుల ముందే థాయ్‌లాండ్ ఓపెన్ ఫైనల్స్ రీచ్ అవ్వడమే కాకుండా, గంటకు పైగా సాగిన హోరాహోరీ పోరులో గెలిచి 'సింగపూర్ ఓపెన్' టైటిల్‌ను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఓవర్‌లోడ్ వల్లే సాత్విక్ భుజంపై ప్రెషర్ పడినట్లు తెలుస్తోంది.

గాయాలపై సాత్విక్ ఓపెన్ టాక్: 
ఇదే ఏడాది ఢిల్లీలో జరగబోయే వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, అలాగే ఆసియా గేమ్స్ (Asian Games) వంటి మెగా టోర్నీలు ఉండటంతో.. ప్లేయర్స్ ఫిట్‌నెస్ మేనేజ్‌మెంట్ చాలా కీలకంగా మారింది. గాయాల గురించి సాత్విక్ ఇటీవల మాట్లాడుతూ.. ఇంజూరీస్ అనేవి నా ఒక్కడికే కావు, ఎవరి కెరీర్ కూడా 100 శాతం పర్‌ఫెక్ట్‌గా సాగదు.. మనం మన బాడీకి రెస్పెక్ట్ ఇవ్వాలి.. నా స్టైల్ ఆఫ్ ప్లే కొంచెం అటాకింగ్‌గా (Aggressive) ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి పెద్ద టోర్నీలు మిస్ అవ్వక తప్పదు.. వాటిని లైట్ తీసుకుని, మెయిన్ టోర్నమెంట్స్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించడంపైనే ఫోకస్ పెట్టాలని సూచించాడు. 

ఇండియన్ ప్లేయర్స్ సీన్ ఏంటి?: 
* ఒకవైపు సాత్విక్-చిరాగ్ తప్పుకున్నా.. ఇండియాకు మిక్స్డ్ డబుల్స్‌లో గుడ్ న్యూస్ అందింది. రోహన్ కపూర్ - శివాని రుత్విక గద్దె జోడీ చైనీస్ తైపీ ప్లేయర్లపై స్ట్రెయిట్ గేమ్స్‌లో సూపర్ విక్టరీ కొట్టి సెకండ్ రౌండ్‌కు దూసుకెళ్లారు. 

* ఇక సింగిల్స్‌ విషయానికి వస్తే.. స్టార్ ప్లేయర్ పీవీ సింధు తన మ్యాచ్ గెలిచి నెక్స్ట్ రౌండ్‌కు క్వాలిఫై అవ్వగా, లక్ష్య సేన్, కిదాంబి శ్రీకాంత్ మొదటి రౌండ్‌లోనే ఓడిపోయి టోర్నీ నుంచి ఎగ్జిట్ అయ్యారు. ఆయుష్ శెట్టి, హెచ్.ఎస్. ప్రణయ్ తమ మ్యాచ్‌లు త్వరలో స్టార్ట్ చేయనున్నారు.