
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడీ.. మకావ్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో బోణీ చేసింది. మంగళవారం జరిగిన మెన్స్ డబుల్స్ తొలి రౌండ్లో రెండోసీడ్ సాత్విక్–చిరాగ్ 21–13, 21–15తో వాంగ్ యీ–ఇంగ్ చియాంగ్ (మలేసియా)పై గెలిచారు. 36 నిమిషాల మ్యాచ్లో ఇండియన్ ద్వయం స్థాయికి తగ్గ ప్రదర్శనతో ఆకట్టుకుంది. బలమైన స్మాష్లు, ర్యాలీలతో ప్రత్యర్థులకు ఎక్కడా చాన్స్ ఇవ్వలేదు. 3–0తో తొలి గేమ్ను మొదలుపెట్టిన సాత్విక్–చిరాగ్ వరుస పాయింట్లతో 6–1, 10–5 ఆధిక్యంలో నిలిచారు.
కానీ క్రాస్ కోర్టు విన్నర్లతో పుంజుకున్న మలేసియన్ జంట ఆధిక్యాన్ని 10–9కి తగ్గించింది. అయితే ఈ దశలో బేస్ లైన్ వద్ద మరింత మెరుగైన షాట్లు కొట్టిన సాత్విక్ వరుసగా మూడు, నాలుగు, రెండు, రెండు పాయింట్లతో దూసుకెళ్లారు. ఇరుజట్ల మధ్య హోరాహోరీగా సాగిన రెండో గేమ్లో 14–13 లీడ్లో నిలిచారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు, నాలుగు పాయింట్లతో గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకున్నారు. మరోవైపు సాత్విక్–చిరాగ్.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్లో మళ్లీ టాప్–10లోకి వచ్చారు. గతవారం చైనా ఓపెన్లో సెమీస్కు చేరడంతో మూడు ర్యాంక్లు మెరుగుపడి పదో ప్లేస్లో నిలిచారు. సింగిల్స్లో లక్ష్యసేన్, ప్రణయ్ వరుసగా 17, 33వ ర్యాంక్ల్లో నిలిచారు. విమెన్స్లో ఉన్నతి హుడా కెరీర్ బెస్ట్ 31వర్యాంక్ను సాధించింది. తెలుగు షట్లర్ పీవీ సింధు 15వ ర్యాంక్లో కొనసాగుతోంది. విమెన్స్ డబుల్స్లో ట్రీసా జోలీ–గాయత్రి 11వ ర్యాంక్లో ఉండగా, తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్ప 45వ ర్యాంక్ను సాధించారు.