క్వార్టర్స్‌‌లో సాత్విక్‌‌-చిరాగ్‌‌

క్వార్టర్స్‌‌లో సాత్విక్‌‌-చిరాగ్‌‌

కౌలాలంపూర్‌‌ : ఇండియా డబుల్స్‌‌ స్టార్‌‌ ప్లేయర్లు సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి.. మలేసియా ఓపెన్‌‌ సూపర్‌‌–1000 బ్యాడ్మింటన్‌‌ టోర్నీలో క్వార్టర్‌‌ఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన డబుల్స్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో వరల్డ్‌‌ రెండో ర్యాంకర్లు సాత్విక్‌‌–చిరాగ్‌‌ 21–11, 21–18తో లుకాస్‌‌ కోర్వి–రొనన్‌‌ లాబర్‌‌ (ఫ్రాన్స్‌‌)పై గెలిచారు. 39 నిమిషాల మ్యాచ్‌‌లో ఇండియన్‌‌ ప్లేయర్లు బలమైన స్మాష్‌‌లు, సుదీర్ఘమైన ర్యాలీలతో చెలరేగారు.

ప్రత్యర్థులకు ఎక్కడా చాన్స్‌‌ ఇవ్వకుండా రెండు గేమ్‌‌ల్లోనూ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్లారు. శుక్రవారం జరిగే క్వార్టర్స్‌‌ మ్యాచ్‌‌లో సాత్విక్ జోడీ.. హి జి టింగ్‌‌–రెన్‌‌ జియాంగ్‌‌ (చైనా)తో తలపడతారు. విమెన్స్‌‌ డబుల్స్‌‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో 21–19, 13–21, 21–15తో ఏడోసీడ్‌‌ మయు మట్సుమోటో–వకనా నగహర (జపాన్‌‌)పై గెలిచి ముందంజ వేశారు.

మెన్స్‌‌ సింగిల్స్‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌ 13–21, 17–21తో ఎంగ్‌‌ కా లాంగ్‌‌ అంగుస్‌‌ (హాంకాంగ్‌‌) చేతిలో కంగుతిన్నాడు. 38 నిమిషాల మ్యాచ్‌‌లో ఎక్కువ అన్‌‌ఫోర్స్‌‌డ్‌‌ ఎర్రర్స్‌‌ చేసిన శ్రీ.. బ్యాడ్‌‌ లైన్‌‌ జడ్జ్‌‌మెంట్‌‌తో ఇబ్బందులుపడ్డాడు.