కొత్త తరహా కాన్సెప్టులతో ఆకట్టుకునే సత్యదేవ్, ఇప్పుడు ‘గాడ్సే’ అంటూ మరో డిఫరెంట్ సబ్జెక్ట్తో రాబోతున్నాడు. అవినీతి రాజకీయాలకి కేరాఫ్ అయిన కొంతమంది నాయకులను ప్రశ్నించే యువకుడిగా ఇందులో కనిపించనున్నాడు. గోపీ గణేష్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన ఈ మూవీ జూన్ 17న రిలీజవుతోంది. ప్రమోషన్స్లో భాగంగా నిన్న ఓ పాటను విడుదల చేశారు. ‘రా రమ్మంది ఊరు.. రయ్యంది హుషారు.. రాగమందుకుంది జ్ఞాపకాల జోరు.. పచ్చనైన చేలు, పల్లె పరిసరాలు.. ఎంతకాలమైనా మరువలేదు నా పేరు’ అంటూ సాగే ఈ పాటలో చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటున్నాడు సత్య. స్కూల్, కాలేజీ ఫ్రెండ్స్ని కలుసుకుంటున్నాడు. సునీల్ కశ్యప్ ట్యూన్ చేసిన ఈ సాంగ్కి రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. రామ్ మిరియాల సింగింగ్ హైలైట్. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో నాగబాబు, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలక పాత్రలు పోషించారు. ఇక సత్యదేవ్ నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ రిలీజ్కి రెడీగా ఉంది. మరోవైపు చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, అక్షయ్ కుమార్ ‘రామసేతు’ చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తున్నాడు.